అమెరికా రహస్యంగా చేస్తున్న ప్రయోగాల గురించి మీకు తెలుసా? ఇప్పటికీ కొనసాగున్నాయి! అమెరికా.. ప్రపంచ అగ్రరాజ్యంగా ఉన్న దేశం. ప్రపంచ దేశాలకు నీతులు చెబుతూ.. తాను మాత్రం ప్రపంచానికి తెలియకుండా.. రహస్య ప్రయోగాలు చేస్తోంది. వాటిల్లో ప్రాజెక్ట్ MK Ultra, Area 51, PRISM ఈ పేర్లు వినగానే ఒక మిస్టరీ సినిమా సీన్ మన కళ్లముందు కనబడుతంది. కానీ, ఇవి కేవలం సినిమా కథలు కాదు.. అమెరికా చరిత్రలో నిజంగా జరిగిన, ఇప్పటికీ వివాదాస్పదంగా మిగిలిన సంఘటనలు. అసలు ఈ రహస్య ప్రయోగాలు ఎందుకు మొదలయ్యాయి? ఎందుకు దాచిపెట్టారు? ఇప్పుడు అవి ఏ స్టేజ్లో ఉన్నాయి? అనే విషయాలతోపాటు అమెరికా రహస్య ప్రయోగాల చీకటి అధ్యాయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అమెరికా రహస్య ప్రయోగాలు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదలైంది. 1947-1991 మధ్య జరిగిన కోల్డ్ వార్లో అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య పోటీ తీవ్రంగా ఉండేది. సైన్స్, టెక్నాలజీ, గూఢచర్యం, ఆయుధాలలో ఒకరినొకరు మించిపోవాలనే పోటీతత్వం నడిచేది. ఈ సమయంలో, అమెరికా తన శత్రువులను అధిగమించడానికి, లేదా వారి రహస్యాలను తెలుసుకోవడానికి, అనేక రహస్య ప్రయోగాలను చేపట్టింది. ఈ ప్రయోగాలు కొన్ని సైన్స్ ఆధా...
Posts
- Get link
- X
- Other Apps
సముద్రంలో కనిపించిన వింత జీవి.. ఇది కేజీ రూ.28 వేలు సముద్రం అంటేనే ఒక మాయా లోకం. చూడటానికి ఎంతో అందంగా కనిపించే సముద్రంలో ఎన్నో అందమైన జీవులు కనిపిస్తాయి. అయితే అందమైన జీవులతోపాటుగా కొన్ని భయంకరమైన జీవులు కూడా కనిపిస్తాయి. అలాంటి ఒక వింత జీవి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం, ఇది యూరప్లోని వేల్స్లోని బెన్నార్ బీచ్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచిన ఒక సముద్ర జీవి. వేల్స్లోని డైఫ్రిన్ ఆర్డుడ్వీ దగ్గర ఉన్న బెన్నార్ బీచ్లో ఒక రోజు షెల్ లాంగ్మోర్ అనే మహిళ సముద్ర తీరంలో నడుస్తోంది. ఒడ్డున కొట్టుకొచ్చిన ఒక విచిత్రమైన జీవిని చూసి ఆమె ఒక్కసారిగా ఆగిపోయింది. అది ఏమిటో ఆమెకు అర్థం కాలేదు. దాని ఆకారం, రూపం చూస్తే సముద్రంలోని ఏదో రాక్షస జీవిలా కనిపించింది. పొడవైన, బాతు మెడలాంటి ఆకారంతో, రాళ్లకు అతుక్కుని ఉన్న ఆ జీవులు ఆమెను భయపెట్టాయి. కానీ, ఈ జీవి గురించి తెలిస్తే, అది భయపెట్టే జీవి కాదని, పైగా అదొక అద్భుతమైన, ఖరీదైన సముద్ర సంపద అని తెలుస్తుంది. సముద్ర నిపుణులు ఈ జీవిని పరిశీలించి, ఇవి Gooseneck Barnacles అని గుర్తించారు. వీటిని బాతు బర్నాకిల్స్ లేదా గూస్ బర్నాకిల్స్ అని కూడా పిలుస్తారు. ఎ...
- Get link
- X
- Other Apps
గ్యాంగ్స్టర్ని ప్రేమించిన టీచర్! తన కోసం జైలులోనే డిగ్రీ చదివిన గ్యాంగ్స్టర్! ఈ రోజుల్లో ప్రేమంటే ఓ ఫిల్టర్ ఫోటో... ఒక Insta స్టోరి. కానీ కొన్ని ప్రేమలు నేరంగా మొదలై, జీవితంగా మారిపోతాయి. అలాంటి ప్రేమ కథే ఇది. ఒక టీచర్, ఒక గ్యాంగ్స్టర్ని ప్రేమించింది. ఆ గ్యాంగ్స్టర్ జైలులో ఉన్నప్పుడు... ఆమె జైలులోకి వెళ్లి అతనిని పెళ్లి చేసుకుంది. ఇది సినిమా కాదు... ఇది నిజమైన కథ. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఉండే ఒక టీచర్ పేరు స్నేహా. స్నేహా ప్రైవేట్ స్కూల్లో సోషల్ టీచర్. తనకి జాబ్, హోమ్ తప్ప వేరే ప్రపంచం తెలియదు. రోజూ స్కూలుకు వెళ్లి, ఇంటికి వచ్చాక తల్లిదండ్రులని చూసుకుంటూ అదే జీవితం అన్నట్లు బతికేది. ఒకరోజు, స్నేహకు ఒక పేపర్లో వార్త కనిపిస్తుంది. ఒక క్రిమినల్ ‘విక్రాంత్’ ను పోలీసులు అరెస్ట్ చేశారని. ఆర్టికల్లో ఉన్న ఫోటో, ఆ కథనం ఆమె మనసుని కదిలించింది. ఎందుకంటే ఆ న్యూస్ పేపర్లో ఉన్న అతని ముఖంలో పశ్చత్తాప ఎక్స్ప్రెషన్ కనిపించింది స్నేహకు. పత్రిక చదవడం, ఆ వ్యక్తి గురించి గూగుల్లో సెర్చ్ చేయడం వంటివి చేసింది. ఇలా కొన్ని వారాలు గడిచిపోయాయి. విక్రాంత్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్...
- Get link
- X
- Other Apps
విజయవాడలో ఉగ్రవాదులు! హై అలర్ట్లో విజయవాడ! జమ్మూకశ్మీర్ ఉగ్రదాడి తర్వాత కేంద్ర దేశవ్యాప్తంగా భద్రతా బలగాలను అప్రమత్తం చేసింది. ఈ దాడి పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ మద్దతుతో జరిగినట్లు భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో, విజయవాడలో ఉగ్రవాద కదలికలపై నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. దీనితో విజయవాడ నగరం హై అలర్ట్లో ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్టుల ప్రకారం, సిమి అంటే ‘స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా’ సంబంధాలున్న 10 మంది అనుమానిత ఉగ్రవాదులను గుర్తించారు. వీరిలో నలుగురు విజయవాడ నగరంలో, మరో ఆరుగురు శివారు ప్రాంతాల్లో ఉన్నట్లు సమాచారం. ఈ అనుమానితులు ఏసీ మెకానిక్లు, మసీదుల వద్ద బిచ్చగాళ్లు, బడ్డీకొట్లలో కార్మికులుగా మారువేషంలో తిరుగుతున్నట్లు తెలిసింది. ఈ హెచ్చరికలు విజయవాడలో భద్రతా చర్యలను మరింత కఠినతరం చేశాయి, ప్రజల్లో ఆందోళనను కలిగించాయి. విజయవాడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక కేంద్రం. ఈ ఉగ్రవాద హెచ్చరికల నేపథ్యంలో, నగరంలో భద్రతా బలగాలు విస్తృత చర్యలు చేపట్టాయి. విజయవాడ పోలీసు కమిషనర్ కాంతి రానా తాతా నేతృత్...
- Get link
- X
- Other Apps
బిడ్డను చంపి.. తల్లిపై గ్యాంగ్ రేప్..! నేడు చట్టాలు ఎంత కఠినతరం చేసినా కానీ, దేశంలో ఆడవాళ్లపై అఘాయిత్యాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల హర్యానాలోని జీంద్లో జరిగిన ఒక దారుణమైన ఘటన మనసును కలచివేస్తోంది. దేశంలో రోజురోజుకీ మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు, హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం, రోజూ సగటున 100కి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జీంద్లోని ఓ మురికివాడలో జరిగిన ఈ ఘటన మరోసారి సమాజంలోని క్రూరత్వాన్ని బయటపెట్టింది. ఓ మహిళ, ఆమె ఐదేళ్ల చిన్నారిపై నలుగురు దుండగులు చేసిన దాడి గుండెల్ని పిండేసేలా ఉంది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. హర్యానా రాష్ట్రంలోని జీంద్ మురికివాడలో ఓ మహిళ భర్త నలుగురు పిల్లలతో నివసిస్తుంది. ఈ క్రమంలోనే మంగళవారం గుడిసెలో భర్త లేని సమయం చూసి స్నేహితులతో కలిసి అమిత్ వచ్చాడు. ముగ్గురు పిల్లలతో కలిసి గుడిసెలో నిద్రపోతున్న బాధితురాలపై దాడి చేశారు. అనంతరం ఆమెతో పాటు ఐదేళ్ల చిన్నారిని పక్కనే ఉన్న చెత్త కుప్ప వద్దకు ఎత్తుకెళ్లారు. అక్కడ చిన్నారి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం బాధితురాలిపై నలుగురు ...
- Get link
- X
- Other Apps
సీమా హైదర్ పాకిస్థాన్కు వెళ్లాలా? భారత్లోనే ఉండొచ్చా? చట్టం ఏం చెబుతోంది? మీకు సీమా హైదర్ గుర్తుందా? 2019లో PUBG ఆన్లైన్ గేమ్ ఆడుతూ 32ఏళ్ల ఒక పాకిస్తాన్ మహిళ ఉత్తరప్రదేశ్కు చెందిన యువకుడితో ప్రేమపడి, చట్టవిరుద్ధంగా ఇండియాలోకి వచ్చింది. పాకిస్థాన్లోని సింధ్ ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల సీమా హైదర్.. PUBG ఆడుతూ నోయిడాకు చెందిన సచిన్తో పరిచయం ఏర్పడింది. తర్వాత వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ చాట్ చేసుకున్న తర్వాత ప్రేమలో పడ్డారు. 2023లో సీమా తన నలుగురు పిల్లలతో కలిసి నేపాల్ మీదుగా భారత్కు వచ్చి సచిన్ను పెళ్లి చేసుకుని, ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఆ తర్వాత కేసులు నమోదవడం, అవి ఇప్పుడు విచారణంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం భారత్లో ప్రతి పాకిస్తానీ.. భారత్ నుంచి వెళ్లిపోవాలని అల్టిమేటం జారీ అయింది. మరి పాకిస్తాన్ నుంచి పాయిపోయి వచ్చిన సీమా ఇప్పుడు భారత్లో వదిలి వెళ్లాలా? లేక ఇక్కడే ఉండిపోవచ్చా? అని హాట్ టాపిక్గా నడుస్తోంది. దీనిపై సీమా లాయర్ స్పందించాడు. సీమా లాయర్ ఎ.పి. సింగ్.. కేంద్రం ఆదేశాలు పాకిస్థానీ పౌరసత్వం కలిగిన వారికి మాత్రమే వర్తిస్...
- Get link
- X
- Other Apps
పది తలల రావణాసురుడికి ప్రత్యేక ఆలయం.. మనకి దగ్గర్లోనే..? పది తలల రావణుడు.. రాముడి చేతిలో ఓడిపోయిన రాక్షసుడిగా మనందరికీ తెలుసు. కానీ, రావణుడు అనేక విద్యలు తెలిసిన మహాపండితుడు. అయినా మనం అతన్ని రాక్షసుడిగానే గుర్తుపెట్టుకున్నాం. కానీ, ఈ దేశంలో ఓ ఊరు మాత్రం, రావణుడిని దేవుడిలా పూజిస్తుంది. ఆలయం కట్టి ప్రతిరోజూ అర్చనలు, అభిషేకాలు చేస్తుంది. మనం ఎలా అయితే, భగవంతుడికి ప్రత్యేకంగా జాతర జరుపుతామో. అదే విధంగా ఆ ఊరుఊరంతా రావణుడికి జాతర నిర్వహిస్తుంది. ఈ ఊరిలో రాముడి పేరు కాదు, రావణుని పేరే వినిపిస్తుంది. ఎవరు ఏ సమస్యతో వచ్చినా సరే పూజారి రావణుని ఆశీస్సులు కోరతారు. ఒకసారి ఊరిలో వర్షం కురిసిందంటే అది రావణుడి కటాక్షమని నమ్ముతారు. ఇదంతా వినడానికి వింతగా ఉంది కదా? కానీ ఈ కథ వెనుక దాగున్న నిజాలు, నమ్మకాల పరంపర, పౌరాణిక భయాలు ఇలా అనేక విషయాలు దాగి ఉన్నాయి. ఇదీ రావణుడే దేవుడిగా మారిన గ్రామం కథ. మరి ఆ గ్రామం ఎక్కడ ఉంది? ఆ గుడి ప్రత్యేకతలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. రావణాసురుడంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది సీతాపహరణం, రాక్షస స్వభావం, రామునితో యుద్ధం. కానీ, ఇదంతా ఆయన జీవితం...