Posts

Image
 కిమ్ రూల్స్ తెలిస్తే.. పిచ్చెక్కుతుంది!  పాపం నార్త్ కొరియా ప్రజలకు.. ఇంటర్నెట్ అంటే ఏంటో తెలియదు!  ఉత్తర కొరియా దేశాన్ని భూమిపైనే ఉన్న మరో ప్రపంచమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దేశాలన్నిటిలో నార్త్ కొరియా రూటే సపరేటుగా ఉంటుంది. ప్రపంచంతో సంబంధం లేని ఆ దేశంలో జీవించడం అంత ఈజీ కాదు. అక్కడి పరిస్థితులు మిగతా దేశాల కంటే భిన్నంగా ఉంటాయి. ఉత్తర కొరియా నియంత కిమ్ అత్యంత కఠినంగా ఉంటాడు. ఆయన తీసుకునే కఠిన నిర్ణయాలు, విధించే ఆంక్షలు మనకు చిత్రంగా అనిపిస్తాయి. కానీ, నార్త్ కొరియా ప్రజలకు మాత్రం అవి తప్పని తిప్పలు. మరి కిమ్ రూల్స్ ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉత్తర కొరియాలో జీవితం అంటే ఒక విచిత్రమైన కల కంటే తక్కువేమీ కాదు. ఇక్కడ ప్రతి చిన్న విషయంపై నియంత్రణ ఉంటుంది. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా ప్రజలు మాత్రం మధ్యయుగ శైలిలోనే బతుకుతున్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అక్కడ ప్రజలు శ్వాస కూడా తీసుకోవడం కష్టమే!ఇలాంటి ఉత్తర కొరియాలోని రూల్స్ గురించి మాట్లాడుకోవడమంటే కిమ్ జాంగ్ ఉన్ గురించి మాట్లాడినట్టే ఉంటుంది. ఎందుకంటే ఇతగాడు ఒక దేశాన్ని పాలిస్తున్నాడా లేక ఒక భారీ రియాలిటీ షో ...
Image
 మీకు రూ.92 లక్షలు కావాలా? అయితే ఆ దేశంలో ఉంటే చాలు మన ఊర్లో ఓ ఇల్లు కొనాలంటే… లోన్స్, బ్యాంకు వడ్డీలు, డాక్యుమెంట్లు, ఇంటి పాస్‌బుక్ కోసం రెండేళ్లపాటు చుట్టూ తిరిగితే కానీ పని జరగదు. కానీ, ఓ దేశం మాత్రం.. ‘రా బాబూ, ఇల్లు కొనుగోలు చెయ్.. పైగా దాదాపు కోటి రూపాయలు ఫ్రీగా తీసుకో!’ అంటూ ఆహ్వానిస్తోంది. ఆ దేశం ఏంటి? అక్కడున్న ఆఫర్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం.  ఈ అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న దేశం పేరు ఇటలీ. మీరు గాని ఇటలీలో సెటిల్ అవ్వాలనుకుంటే ఇదే మంచి టైం. ఇక్కడ సెటిల్ అయితే అక్కడి ప్రభుత్వమే డబ్బు ఇస్తుంది. ఉత్తర ఇటలీలోని కొన్ని పల్లెలు నెమ్మదిగా ఖాళీ అవుతున్నాయి. ఉద్యోగ అవకాశాల కోసం యువత పట్టణాలకు వలస వెళ్తున్నారు. దీంతో గ్రామాల్లో నివసించే వాళ్ల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. ఆ జనాభా క్షీణతను అడ్డుకునేందుకు అక్కడి ప్రభుత్వం కొత్తగా ఒక ప్రయోగం మొదలెట్టింది. ఇటలీ దేశస్థులైనా.. ఇతర దేశస్థులైనా ఇటలీలోని వర్మిగ్లియో గ్రామంలో స్థిరపడాలనకుంటే వారికీ అక్కడి ప్రభుత్వం రూ. 92 లక్షల వరకూ ఫ్రీగా ఇస్తుంది.  ఈ ఆఫర్ పేపర్ మీద చూస్తే అదిరిపోతుందనిపిస్తుంది. ఇటలీలో ఒక అందమైన గ్రామంలో సెటిల్ అవ...
Image
 ఈ చెట్లు నడుస్తాయి! ఎందుకో చూడండి. అమెజాన్ అడవి అనేక అద్భుతాలను తనలో దాచుకుని ఉంది. ఇది ప్రపంచంలోని అతి పెద్ద వర్షారణ్యాల్లో ఒకటి. ఇక్కడ సహజసిద్ధమైన ప్రకృతితో పాటు ఎన్నో రహస్యాలు, ఎన్నో వింతలు దాగి ఉన్నాయి. సాధారణంగా చెట్లు అవి పుట్టిన చోటే ఉంటాయి. కానీ, ఈ అమెజాన్‌ అడవిలో ఉండే కొన్ని చెట్లు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణిస్తాయి.  వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ, ఇది నిజం. అమెజాన్ అడవుల్లో పెరిగే  ‘సోక్రటీయా ఎక్సోరిజా’ అరుదైన చెట్లు ప్రతిరోజు కొన్ని మీటర్ల దూరం నడుస్తాయట.  ఈ చెట్టు చూసేందుకు చాలా విచిత్రంగా ఉంటుంది.  సాధారణ చెట్టు వేర్లు భూమిలో ఉంటాయి. కానీ, ఈ చెట్టు వేర్లు మాత్రం నేలపైకి పెరిగి కనిపిస్తాయి. అంతేకాదు ఆ వేర్లతోనే కొంతదూరం నడచుకుంటూ వెళ్తాయి.  ఈ చెట్లు ఎందుకు కదులుతాయి అనే విషయం శాస్త్రవేత్తలకే ఇప్పటికీ ఓ మిస్టరీగానే ఉంది. అయితే, శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం.. ఈ చెట్లు కదలడానికి ప్రధాన కారణం.. సూర్యకాంతిని అందుకునే అవకాశం. అమెజాన్ అడవి అంత సాంద్రంగా ఉండటంతో, చెట్లపై సూర్యరశ్మి తక్కువగా పడుతుంది. చెట్లు తమ జీవన ప్రక్రియ కొనసాగ...
Image
 గోల్డెన్ న్యూస్.. తులం బంగారం రూ.55వేలు! పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అంతగా మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయింది బంగారం. అంతేకాదు.. పెట్టుబడి పెట్టాలనుకునేవారికి పసిడి మంచి సాధనం. పసిడితోపాటు వెండికి కూడా మంచి గిరాకీ ఉంది. అందుకే నిత్యం బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతుంటాయి. నిన్నటి వరకు అందుకోండి చూద్దాం అంటూ మిడిసి పడిన బంగారం.. ఇప్పుడు నేలపైకి దిగొస్తోంది. కొన్ని రోజుల్లో లక్ష దాటుతుందనుకున్న బంగారం కొన్ని రోజుల్లో మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది.  ఇంటర్నేషనల్ మార్కెట్లో 4-5 రోజుల కిందట స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 3168 డాలర్ల వద్ద ఉంది. ఇక్కడ ఔన్సు అంటే 31.10 గ్రాములు. అక్కడి నుంచి వరుసగా రెండు రోజులు 60 డాలర్ల వరకు పడిపోగా.. మళ్లీ 2 రోజులు స్థిరంగా ఉంది. ఇప్పుడు 3030 డాలర్ల స్థాయి నుంచి ఒక్కరోజులోనే 30 డాలర్లకుపైగా పడిపోయి 3 వేల డాలర్ల దిగువకు చేరింది. సిల్వర్ రేటు కూడా భారీగా దిగొస్తోంది.  దేశీయంగా చూస్తే హైదరాబాద్ నగరంలో ఇవాళ 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 250 తగ్గింది. దీంతో ప్రస్తుతం తులం గోల్డ్ రేటు రూ. 82,850 కి పడిపోయింది. దీ...
Image
 అల్లుడితో పారిపోయిన అత్త సాధారణంగా ఒక అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుని, పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు రకరకాల కారణాలతో ఇరు కుటుంబ పెద్దలు అడ్డుకుంటారు. వీరి ప్రేమకు ఆస్తులు, కులాలు, మతాలు అడ్డుగా నిలుస్తాయి. కొందరు రాజీ పడి విడిపోగా.. మరికొందరు పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకుంటారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో సినిమాల్లోనూ, నిజ జీవితంలోనూ చూస్తుంటాం. ప్రేమ ఎప్పుడు ఎవరికి ఎలా పుడుతుందో తెలియదు. కానీ, ఇప్పుడున్న ప్రేమ మాత్రం వావి వరుసలు లేకుండా ఉంటుంది. సరిగా ఇలాంటి ఓ వార్త నెట్టింట సంచలనం  సృష్టిస్తోంది.  పది రోజుల్లో కూతురి వివాహం అనగా .. ఓ తల్లి అమ్మాయికి కాబోయే వరుడితో పారిపోయింది. ఈ విచిత్ర సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.  ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో ఈ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. నాలుగు నెలల క్రితం ఓ మహిళ కూతురికి పెళ్లి చేయడం కోసం ఓ యువకుడిని చూసింది. అతనితోనే కూతురికి నిశ్చితార్థం జరిగింది.పెళ్లికి మరో 9 రోజుల సమయం మాత్రమే ఉందనగా.. అమ్మాయి తల్లి కాబోయే అల్లుడితో పారిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పెళ్లి షాపింగ్‌కు వెళ్తున్నామని ఇంట్లో చెప్పి వెళ్లిన అ...
Image
 1. మనుషుల్ని తినే భయంకరమైన తెగలు.. ప్రపంచం మొత్తం శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతో ముందుకు సాగుతున్న ఈ రోజుల్లో కూడా… కొన్ని తెగలు ఇంకా ఆదిమ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాయి. అవి మనిషి పుట్టుక, సమాజ నిర్మాణానికి సంబంధించి ఎన్నో రహస్యాలను దాచుకొని ఉన్నాయి. అయితే, వాటిలో కొన్ని తెగలు మాత్రం.. మనిషికి, సమాజానికి శత్రువులేనని చెప్పవచ్చు. మనషులను చూస్తే చాలు వారిపై దాడి చేసి, వారిని చంపేంత క్రూరమైన తెగల వారు ఇంకా ఉన్నారు. ప్రపంచంతో సంబంధం లేకుండా, ఎన్నడూ బయటకి రాకుండా.. వారి జీవనశైలి మానవాళికి విరుద్ధంగా కనిపించే వారి చర్యలను ఒకసారి లోతుగా తెలుసుకుందాం. ఇది కేవలం భయంకర తెగలకు సంబంధంచిన కథలు మాత్రమే కావు… మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేని మరో మానవ చరిత్ర కోణం గురించి తెలిపే మూడు తెగల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం.  2004లో సంభవించిన విధ్వంసకర సునామీ తర్వాత, హిందూ మహాసముద్రం అండమాన్ దీవులలోని గిరిజన ప్రజల జీవన విధానం ఒక రహస్యంగానే మిగిలిపోయింది. అన్నింటికంటే ముఖ్యంగా, ఆ గిరిజన తెగలలోని వారిలో ఒక జాతి సెంటినెలీస్. ఇది ఒక భయంకరమైన తెగ. బయటి ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం ఒక చిన్న దీవ...
Image
 పవన్ కుమారుడికి ప్రమాదం స్పందించిన YS జగన్  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో గాయపడిన ఘటనపై వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ఈ ప్రమాదంలో పవన్ కుమారుడు గాయపడ్డాడని తెలిసి షాక్ అయ్యా.  ఈ క్లిష్ట పరిస్థితిలో ఆ కుటుంబానికి అండగా ఉంటాం;  మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్న;  అని వైయస్ జగన్మోహన్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలు రాసుకొని వచ్చారు