Posts

Image
 AP లో NDA ప్రభుత్వం 2024 సం. లో ఏర్పడిన తర్వాత 2025 సం.  కు గాను వేట నిషేద సమయంలో 1,29,789 మందికి మత్స్యకార భరోసా కింద జీవనభృతి 258 కోట్ల రూపాయలు విడుదల చేసారని ఏప్రిల్ 26 వ తేదీన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ప్రభుత్వం చెక్ ను విడుదల చేస్తూ ప్రకటన చేసింది . ఇంకా అందులో 53650 మంది అర్హత కలిగిన మత్స్యకారులకు మత్స్యకార భరోసా రావాల్సి ఉందని ప్రచారం జరుగుతుంది. కనుక ఇంకా ఎంత మందికి మత్స్యకార భరోసా ఇవ్వలేదో, ఏ కారణాలు చేత ప్రభుత్వం అకౌంట్ లలో డబ్బులు జమ చేయలేదో అలాగే మిగిలిన వారికి మత్స్యకార భరోసా డబ్బులు ఎప్పుడు బ్యాంక్ అకౌంట్ లలో జమ చేస్తారో సరియైన ప్రకటన చెయ్యాలి అని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని , ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రార్ధిస్తున్నాం 🙏.
Image
 అది రాయి దాడి కాదు... ఒక వడ్డెర కులస్తుడి జీవితాన్ని జగన్ నాశనం చేశారు: ఏబీ వెంకటేశ్వరరావు శవాలపై రాజకీయాలు చేసే వ్యక్తి జగన్: ఏబీవీ రాయి దాడి కేసులో సతీశ్‌ను బలిపశువును చేశారని ఆరోపణ గజమాల దెబ్బను రాయి దాడిగా చిత్రీకరించి లబ్ధి పొందారన్న ఏబీవీ సతీశ్‌ను, అతని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ కేసు మూసివేసి, బాధితుడికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి గత ఎన్నికల సమయంలో మాజీ సీఎం జగన్ పై విజయవాడలో జరిగింది రాయి దాడి కానే కాదని, అది కేవలం రాజకీయ లబ్ధి కోసం అల్లిన కట్టుకథ అని మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఘటనను అడ్డం పెట్టుకుని, అమాయకుడైన వడ్డెర కులానికి చెందిన సతీశ్ అనే యువకుడి జీవితాన్ని, అతని కుటుంబాన్ని జగన్ నాశనం చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శవాలపై పేలాలు ఏరుకుంటూ, మనుషుల జీవితాలతో చెలగాటమాడే నైజం జగన్‌దని ఆయన తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఏబీ వెంకటేశ్వరరావు నేడు విజయవాడలో 'రాయి దాడి' కేసులో నిందితుడిగా చిత్రికరించబడి, 45 రోజుల పాటు అక్రమంగా జైలు జీవితం గడిపిన...
Image
 Sr NTR పైన ఎందుకు ఇంతలా trolls చేస్తున్నారు ఎన్టీఆర్ తిండి అలవాట్ల పై ట్రోల్స్ వైసీపీ, జనసేన సోషల్ మీడియాను దాటుకుని.. మీమర్స్, కామన్ నెటీజన్స్, జియో హాట్ స్టార్, జోమాటో వరకు వెళ్లిపోయాయి.  టీడీపీ స్వయంకృతం. ప్రజలు హద్దులు దాటిన వ్యక్తి పూజను అంగీకరించరు. ఓదార్పు యాత్ర సమయంలో జగన్ పై కూడా ఇలాంటి ట్రోల్స్ వచ్చాయి.. కానీ కార్పొరేట్ స్థాయి వరకు వెళ్ళలేదు.  ఎన్టీఆర్ లేకపోతే తెలుగు ప్రజలు లేరు, తెలుగు ఐడెంటిటీ లేదు, తెలుగు ప్రముఖుల్లో ఎన్టీఆర్ ది ప్రధమస్థానం అని ఇన్నాళ్లూ టీడీపీ జనం పై రుద్దింది. బతికుండగా ఎన్టీఆర్ ను పదవి నుండి తప్పించి, టీడీపీ నుండి బహిష్కరించి, చెప్పులు వేసి మరీ అవమానించారు. 11 మంది సంతానంలో ఒక్కళ్ళూ ఆయన పక్షాన నిలబడింది లేదు.  ప్రస్తుతం వీరే ఎన్టీఆర్ ను కారణజన్ముడు, దైవంశ సంభూతుడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అంటూ ప్రతి ఏటా ప్రజలకు విసుగు, చికాకు తెప్పిస్తున్నారు. ఎందుకు ఈ సారి నెటిజన్లు ఔట్ బరస్ట్ అయ్యారు.
Image
 ఒకప్పుడు టీవీలో అరిచి గోల చేసిన Naaptol ఇప్పుడేమైంది? ప్రజలను ఎలా మోసం చేసింది! ‘నాప్టోల్’ ఈ పేరు తెలియని వారు దాదాపుగా ఎవరూ ఉండరు. ఇప్పుడంటే ఇంట్లో కూర్చొని ఒక క్లిక్‌తో షాపింగ్ చేయడం సర్వసాధారణం. కానీ, ఆన్‌లైన్ షాపింగ్ పెద్దగా అందుబాటులో లేని రోజుల్లో టీవీలో నాప్టోల్ చేసిన అడ్వటైజ్ హడావుడి అంతా ఇంతా కాదు. జస్ట్ టీవీ ఆన్‌ చేస్తే చాలు.. ఆఫర్ ఆఫర్ అంటూ అరిచి గోల చేసేవాళ్లు. తక్కువ స్టాక్ ఉంది. డిస్కౌంట్ ఆఫర్ కొద్ది సమయం మాత్రమే.. త్వరపడండి త్వరపడండి అంటూ హంగామా చేసేవాళ్లు. ఇలా నాప్టోల్ యాంకర్ అరిచి గోల చేయని ఇళ్లు ఉండదేమో.  ఇంటర్నెట్, ఆన్‌లైన్ షాపింగ్  అంతగా లేని రోజుల్లో అరిచి గోల చేసి మరీ సామాన్యులతో వస్తువులను కొనిపించిన నాప్టోల్ ఇప్పుడు కనీసం కనిపించును కూడా కనిపించడం లేదు. దీనికి కారణం.. నాప్టోల్‌లో జరిగిన మోసం, ఫిర్యాదులు, కోర్టు కేసులు ఒక కారణమని చెప్పొచ్చు.  అసలు ఈ నాప్టోల్ ఎలా పుట్టింది. ప్రతి ఇంట్లో ఈ యాడ్ వచ్చేలా చేసిన స్ట్రేటజీ ఏంటి? ఎలా పాపులర్ అయింది? ప్రజలను ఎలా మోసం చేసింది? కోర్టుకు ఎందుకు వెళ్లింది? చివరకు ఏమైందని ఈ వీడియోలో తెలుసుకుందాం. నాప్టోల్ క...
Image
 పల్నాడు జిల్లా.. సత్తెనపల్లి  సత్తెనపల్లి లో మాజీ ముఖ్యమంత్రి జగన్ పై  ఎమ్మెల్యే  కన్నా లక్ష్మీనారాయణ కామెంట్స్ . జగన్ హయాంలో రాక్షస ,అరాచక పాలన సాగింది..  వైసీపీ పాలనలో ఎన్నికల ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురుచుశారు .. జరిగిన ఎన్నికల్లో ప్రజలు జగన్ కు బుద్ధి చెప్పారు .. కూటమి ప్రభుత్వం లో ప్రజాస్వామ్య పాలన జరుగుతుంది .. తెనాలి లో ఆరాచక శక్తులను మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రోత్సాహిస్తున్నారు .. గతంలో పరామర్శ వెళ్లిన లోకేష్ పై  వైసీపీ వాళ్లు దాడి చేశారు . ఆరాచక శక్తులకు జగన్ మద్దతు .. చంద్రబాబు ఆధికారంలోకి రావటంతో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని సమిక్షించారు .. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు చంద్రబాబు .. సత్తెనపల్లి నియోజకవర్గంలో  అభివృద్ధి కార్యక్రమలు చేస్తున్నాము .. కొండమోడు ..పేరెచర్ల రహదారి  పనులు ప్రారంభం .. కూటమి ప్రభుత్వం లో అభివృద్ధి ,సంక్షేమం పరుగులు తీస్తుంది .. అమరావతి రాజధాని రావటంతో భూములు విలువ పెరిగింది ..
Image
 185 ఏళ్ల నుంచి ఇప్పటికీ మోగుతున్న బెల్..  శాస్త్రవేత్తలకే అర్థం కాని మిస్టరీ నేటి టెక్నాలజీ అద్భుతాల్ని సృష్టిస్తోంది. ఏ మెషిన్ చూసినా తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం ఇస్తోంది. కానీ, ఇదంతా  కొత్తకాదని, శతాబ్దాల కిందట కూడా కొన్ని అద్భుతాలు జరిగాయని చెబుతున్నారు నిపుణులు. ఆ అద్భుతాల్లో ఒకటే, 185 ఏళ్లుగా పని చేస్తున్న ఒక చిన్న ఎలక్ట్రిక్ బెల్. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా? 185 ఏళ్ల నుంచి ఎలక్ట్రికల్ బెల్ పనిచేయడమేంటని ఆశ్చర్యపోతున్నారా..? కానీ ఇది నిజం. ఈ బెల్ 1840లో మొదటిసారిగా మోగింది. అప్పటినుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు రెండు శతాబ్దాలుగా అది ఒక్కసారైనా ఆగిందన ఆధారాలే లేవు. దీని గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం.  సాధారణంగా ఒక ఎలక్ట్రిక్ బ్యాటరీ గానీ, మరే వస్తువైనా గానీ ఎన్ని రోజులు పనిచేస్తుంది? మహా అయితే ఆర్నెల్లు, అంతకు మించితే ఏడాది చేయవచ్చు. కానీ,  ఆక్స్‌ఫర్డ్‌లోని క్లారెండన్ లాబొరేటరీలో ఉన్న ఈ గంట ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది. ఈ బెల్ విద్యుత్ ఆధారంగా నడుస్తోంది. కానీ అది ఏ సౌరశక్తి కాదు, నేడు మనం వాడుతున్న లిథియమ్ బ్యాటరీలు కూడా కావు....
Image
 మస్క్ ఎంతటి రసికుడో తెలుసా? కోట్లాది పిల్లలను కనాలనుకుంటున్నాడు! మరో ఛంగిజ్‌ ఖాన్‌లా మారతానంటున్న మస్క్!  ఎలాన్ మస్క్.. ప్రపంచ కుబేరుడు, అపర మేధావి మాత్రమే కాదు. అంతకుమించిన రసికుడు కూడా. అతని రాసలీలలు ఏ స్థాయిలో ఉన్నాయో.. సంతానం విషయంలో అతని ఆలోచనలు ఎక్కడిదాకా వెళ్లిపోయాయో తెలిస్తే షాక్ అవుతారు. మస్క్ ప్రస్తుత ప్లాన్ కేవలం పిల్లలను కనడమే. అది కూడా కోట్లలలో ఇది సినిమా కథ కాదు, నిజంగా లీక్ అయిన షాకింగ్ సీక్రెట్!   ఎలాన్ మస్క్ ఈ విచిత్రమైన ప్లాన్ ఏంటి, అతను ఎందుకు ఇలాంటి క్రేజీ ఆలోచనలు చేస్తున్నాడు. ఈ వివాదం ఎలా బయటపడిందో తెలుసుకుందాం.  ఎలాన్ మస్క్ టెస్లా, స్పేస్‌ఎక్స్, X లాంటి కంపెనీల సృష్టికర్త. కానీ, అతని జీవితంలో ఒక సీక్రెట్ సైడ్ ఉంది, అది ఇప్పుడు ప్రపంచం ముందుకు వచ్చింది. వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ ప్రకారం.. మస్క్ తన జన్యువులతో ఒక ‘లీజన్’ అనే భారీ సంఖ్యలో పిల్లలను సృష్టించాలని కలలు కంటున్నాడు! అవును, మస్క్ ఇప్పటికే 14 మంది పిల్లల తండ్రి, నలుగురు వేర్వేరు మహిళలతో పిల్లలను కలిగి ఉన్నాడు. కానీ, ఇది కేవలం ఆరంభం అని సోర్సెస్ చెబుతున్నాయి! మరిన్ని పిల్లలు ఉండొచ...
Image
 శ్రీదేవీ మరణం నాచురల్ డెత్ కాదు.. బోనీకపూర్ లై డిటెక్ట్! సినిమా పరిశ్రమలో లెజెండ్‌గా నిలిచిన శ్రీదేవీ, దుబాయ్‌లోని హోటల్ రూమ్‌లో విగతజీవిగా కనిపించి మనకు దూరమైన విషయం అందరికీ తెలిసింది. 2018లో జరిగిన ఆ షాకింగ్ ఘటన ఇప్పటికీ మనల్ని కలచివేస్తుంది. బాత్‌టబ్‌లో డ్రౌన్ అయినట్లు చెప్పిన అధికారిక రిపోర్ట్‌ను చాలామంది నమ్మలేదు. సోషల్ మీడియాలో కాన్స్‌పిరసీలు, శ్రీదేవీ భర్త బోనీ కపూర్ మీద అనుమానాలు వెల్లువెత్తాయి. ఇన్నేళ్లు మౌనంగా ఉన్న బోనీ, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నోరు విప్పాడు. అతను చెప్పిన నిజాలు, లై డిటెక్టర్ టెస్ట్ గురించి, ఇండియా మీడియా ఒత్తిడి గురించి వివరాలు అందరికీని ఆశ్చర్యపరిచాయి. ఈ వీడియోలో, ఆ రహస్యాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.  శ్రీదేవీ మిస్టర్ ఇండియా, చాందినీ, ఇంగ్లీష్ వింగ్లీష్ లాంటి సినిమాలతో భారత సినిమాకు ‘ఫస్ట్ ఫిమేల్ సూపర్‌స్టార్’ ట్యాగ్ సంపాదించిన గొప్ప నటి. 2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లో ఒక ఫ్యామిలీ వెడ్డింగ్‌కి వెళ్లిన ఆమె, జుమేరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్ రూమ్ బాత్‌టబ్‌లో డ్రౌన్ అయి చనిపోయిందని రిపోర్ట్ వచ్చింది. అధికారికంగా ‘యాక్సిడెంటల్ డ్రౌనింగ్’అన్నారు, కానీ ఇందులో ఏద...
Image
 అబ్బాయిలే కాదు.. అమ్మాయిలు కూడా లైన్ వేస్తున్నారు! సర్వే చెప్పిన సరికొత్త నిజాలు! అమ్మాయిల అందానికి ఫిదా కాని అబ్బాయి ఎవరైనా ఉంటారా? ఎక్కడో ఒకచోట, ఎప్పుడో ఒకసారి అమ్మాయిల అందం ముందు అబ్బాయిల గుండె జారి గల్లంతు అవడం సహజం! ఈ విషయంపై ‘కోడాక్ లెన్స్ విజన్ సెంటర్స్’ అనే సంస్థ 3000 మందిపై చేసిన సర్వే ఫలితాలు నోరెళ్లబెట్టేలా ఉన్నాయి. అబ్బాయిలు అమ్మాయిల అందాన్ని చూస్తూ రోజుకు ఏకంగా 43 నిమిషాలు గడుపుతున్నారట! ఇది సంవత్సరానికి 259 గంటలు, అంటే దాదాపు 11 రోజులు! అంటే అబ్బాయిలు ఏడాదిలో దాదాపు రెండు వారాల పాటు అమ్మాయిల అందాన్ని ఆస్వాదిస్తూ కాలం గడుపుతున్నారు. ఈ సర్వే ప్రకారం, ఒక సగటు పురుషుడు రోజుకు 10 మంది అమ్మాయిలను చూస్తున్నాడట. ఎక్కడంటే.. సూపర్‌మార్కెట్‌, బస్తాండ్‌లు ఈ విషయంలో టాప్‌లో ఉన్నాయి!  ఆ తర్వాత పబ్‌లు, నైట్‌క్లబ్‌లు, వర్క్‌ప్లేస్‌లు కూడా ఈ లిస్టులో హాట్‌స్పాట్‌లుగా ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, సగం మంది అబ్బాయిలు ‘అమ్మాయిల శరీరాకృతినే చూస్తాం’ అని ఒప్పుకున్నారు! అయితే, ఈ అబ్బాయిల చూపులను చాలామంది అమ్మాయిలు ఆనందంగా తీసుకుంటారట, అంటే కాంప్లిమెంట్ అన్నట్లు ఫీలవుతున్నారట. క...
Image
 భారత్, పాకిస్తాన్‌కి ఎన్ని యుద్ధాలు జరిగాయి..? యుద్ధంలో పైచేయి ఎవరిది..? పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న శత్రుత్వాన్ని మరోసారి ఉధృతం చేసింది. ఈ దాడి కేవలం ఒక ఉగ్రవాద చర్యగానే మిగిలిపోలేదు. అది కాశ్మీర్ వివాదంలోని లోతైన గాయాలను మరోసారి తెరపైకి తెచ్చింది. ఇది రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలపై, భవిష్యత్ శాంతి అవకాశాలపై లోతైన ప్రభావం చూపింది. అయితే, ఈ సంఘటన నుంచి బయటపడాలంటే, రెండు దేశాలూ ద్వైపాక్షిక చర్చలు, అంతర్జాతీయ మధ్యవర్తిత్వం ద్వారా కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నించాలి. కానీ చరిత్ర చూస్తే, ఈ మార్గం అంత సులభం కాదని తెలుస్తోంది.   1947లో బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు, సరిహద్దు వివాదాలు, మతపరమైన విభేదాలు యుద్ధాల రూపంలో బయటపడ్డాయి. ఈ యుద్ధాలు కేవలం రెండు సైన్యాల మధ్య జరిగినవి కాదు. అవి రెండు దేశాల ప్రజల జీవితాలను, వారి భవిష్యత్తును లోతుగా ప్రభావితం చేశాయి.  ఈ క్రమంలోనే.. ఇరు దేశాల మధ్య మొదటి యుద్ధం 1947-48లో జరిగింది. దీన్ని మొదటి కాశ్మీర్ యుద్ధంగా పరిగణించారు. భారత్, పాకిస్తాన్ స్వా...
Image
 మిలియన్ల సందప దాగున్న కమ్రునాగ్ సరస్సు.. ఇది ఒక మిస్టరీ సరస్సు! భారతదేశం అంటే కేవలం  సంస్కృతి, సంప్రదాయాల గుండె చప్పుడు మాత్రమే కాదు. ఎన్నో రహస్యాలను తనలోనే దాచుకున్న ఒక పెద్ద కథల పుస్తకం. ఇక్కడి దేవాలయాలు, కోటలు, సరస్సులు శాస్త్రవేత్తలకు సైతం సవాల్ విసిరే విధంగా ఉన్నాయి. అలాంటి ఒక రహస్యమే హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక సరస్సు. మహాభారతం కాలం నాటి నుంచి ఈ సరస్సు చుట్టూ పురాణాలు, రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఆ సర్ససు నీటిలో బంగారం, వెండి దాగి ఉన్నాయని, ఒక శక్తివంతమైన యోధుడి కథ దీని వెనుక ఉందని చెబుతారు. కానీ ఈ సంపద ఎలా వచ్చింది? దీని వెనుక కథ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం.  కమ్రునాగ్ సరస్సు హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో, కరోగ్ లోయలో ఉంది. సముద్ర మట్టానికి 3,334 మీటర్ల ఎత్తులో, దట్టమైన దేవదారు చెట్ల మధ్య ఈ సరస్సు అద్భుతంగా కనిపిస్తుంది. ఈ సరస్సు కథ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే.. ముందుగా  బార్బరీకుడు ఎవరో తెలుసుకోవాలి.  పురాణాల ప్రకారం కమ్రునాగ్ మహాభారత యుగంలో ఒక యోధుడు. ఇతడినే బార్బారిక్ అని కూడా పిలుస్తారు. మహాభారతంలో ఒక శక్తివంతమైన యోధుడు. అతడు ఘటోత్కచుడి కొడుకు,...
Image
 ఈ ఒక్క ఆయుధం చాలు.. పాక్‌ను ఉచ్చ పోయించడానికి!  భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి, ఒకవేళ ఈ టెన్షన్ యుద్ధంగా మారితే, భారత్ ఆయుధశాలలో ఒక ఆయుధం గేమ్-చేంజర్‌గా మారుతుంది. అదే బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూజ్ మిసైల్. ఈ మిసైల్ భారత్-రష్యా జాయింట్ వెంచర్‌లో డెవలప్ అయిన వరల్డ్-క్లాస్ ఆయుధం. దీని స్పీడ్, యాక్యురసీ పాక్‌కు కంటిమీద కునుకు లేకుండా చేయగలదు. ఒక్కసారి బ్రహ్మోస్‌‌ లాంచ్ చేస్తే.. ఈ మిసైల్ సెకనుకు 3700 కిలోమీటర్ల వేగంతో, శబ్దం కంటే మూడు రెట్లు వేగంగా వెళ్లి, ఇస్లామాబాద్‌లోని కమాండ్ సెంటర్‌ను సెకన్లలో బూడిద చేయగలదు. ఈ మిసైల్ ఎంత స్పీడ్‌గా వెళ్తుందంటే.. ఢిల్లీ నుండి కరాచీకి కారులో వెళ్తే 20 గంటలు పడుతుంది. కానీ, బ్రహ్మోస్ అక్కడికి 72 సెకన్లలో చేరుతుంది. దీని రేంజ్ 1500 కిలోమీటర్లు, అంటే పాకిస్థాన్‌లో ఏ మూల ఉన్న టార్గెట్ అయినా దీని రాడార్‌లో ఉంటుంది. బ్రహ్మోస్‌ను ల్యాండ్ నుండి మొబైల్ లాంచర్స్‌తో, సముద్రంలో యుద్ధ నౌకల నుండి, లేదా సు-30MKI ఫైటర్ జెట్స్ నుండి లాంచ్ చేయవచ్చు. ఉదాహరణకు, 2019లో బాలాకోట్ స్ట్రైక్‌లో భారత్ సర్జికల్ ప్రెసిషన్ చూపించింది. ఇప్పుడు బ్...
Image
 తల్లిపై కన్నేసిన పక్కింటి అంకుల్.. కూతురు ఏం చేసిందంటే? ఇది ఒక అమ్మాయి గురించి కాదు... ఒక అమ్మ గురించి కాదు... ఇది ప్రేమించే వాళ్లను కాపాడుకోవడం కోసం ఓ చిన్నారి సింహంగా మారిన సంఘటన గురించి. అది ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్న ఓ సాదాసీదా కాలనీ. ఇలాంటి చోట పెరిగే పిల్లలకు చదువు, భవిష్యత్తు, భయం అన్నీ ఒకేసారి పరిచయం అవుతాయి. అక్కడే ఉంటోంది అనిత. ఆమె సింగిల్ మదర్. తన భర్త విడాకులిచ్చాక, తన 14 ఏళ్ల కూతురు శ్రేయతో కలిసి జీవిస్తోంది. వారి పక్కింట్లో ఉండేవాడే నరేశ్. 45 ఏళ్ల వయసు, ఉద్యోగరిత్యా బైకు మీద తిరుగుతుంటాడు. ఒక్కోసారి పనిమీద బయట ఊరికి కూడా  వెళ్తుంటాడు. నరేశ్ పొరిగింటి వ్యక్తి కాబట్టి అనిత వంటపనిలో కొంచెం సాయం చేసేది. మొదట అనితాకి, శ్రేయకి అతను మంచి మిత్రుడే అనిపించింది. కానీ అలా అనిపించడమే అతడి టార్గెట్. ఒక రోజు రాత్రి.. అనితకి జ్వరం వచ్చింది. ఆరోజే శ్రేయ హాస్టల్‌కి వెళ్లాల్సిన రోజు. కానీ తల్లి పడుకుని ఉంది కాబట్టి, పోవడం మానేసింది. శ్రేయ ఉందన్న విషయం తెలియని నరేశ్ నీళ్లు కావాలంటూ అనిత ఇంట్లోకి వచ్చాడు. అప్పుడు శ్రేయ కిచెన్‌లో ఉంది. ఆ గదిలోంచే బయటకు చూస్తోంది. తన తల్లి మంచంపై పడుకు...
Image
 సామాన్యులను భయపెడుతున్న పసిడి! తులం బంగారం రూ.రెండు లక్షలు? ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్నంటుతోంది. మొన్నటి వరకు రూ. 90 వేల స్థాయిలో ఉన్న తులం బంగారం ఇప్పుడు ఏకంగా లక్ష రూపాయల మార్క్‌ను తాకింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు దాదాపు 26% పెరిగిన బంగారం ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. ప్రస్తుతం భౌతిక మార్కెట్‌లో 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 96,590గా ఉంది. దీనికి 3 శాతం జీఎస్టీ కలిపితే దాదాపు రూ. 99,488 అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధరలు పెరుగుతుండటంతో దేశీయంగానూ అదే పరిస్థితి నెలకొంది. లైవ్ మార్కెట్లో ఇవాళ ఒక దశలో తులం గోల్డ్ రేటు రూ. లక్షను తాకింది. బంగారం ధరను గత 70 ఏళ్లలో ఏంత మేరా పెరిగిందో చూస్తే.. ఆశ్చర్యమేస్తోంది. 1955లో 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ.79 మాత్రమే! అంటే ఆ రోజుల్లో ఒక్క వేతనంతో బంగారం కొనడం చాలా సాధ్యమే. 1960కి అది రూ.111కి పెరిగింది. కానీ అసలైన షాక్ మొదలైంది 1980లో – అప్పటికి ఇది నేరుగా రూ.1,330కి ఎగబాకింది. ఆ తరం మనసుల్లో "ఇంకా బంగారం కొనడం కష్టమే" అనే భావన మొదలై ఉంటుంది. 1990లలో భారతదేశం ఆర్థికంగా లిబరలైజేషన్ దిశ...
Image
 అంధురాలని చెత్తకుప్పలో పాడేశారు.. ఇప్పుడు MPSCలో జాబ్ కొట్టింది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం, మహారాష్ట్రలోని జల్గావ్ రైల్వే స్టేషన్ సమీపంలో చెత్తకుప్పలో ఒక చిన్న పాప కనిపించింది. ఆ బిడ్డకు పేరు లేదు, తల్లిదండ్రులు లేరు. ఆ అమ్మాయి అంధురాలు. ఎవరూ ఆ బిడ్డకు భవిష్యత్తు ఉంటుందని ఊహించలేదు. కానీ ఆ అమ్మాయి, తన జీవితంలో అసాధ్యమైనవి సాధ్యం చేసి చూపించింది. మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్  పరీక్షలో ఉత్తీర్ణురాలై, నాగపూర్ కలెక్టరేట్‌లో రెవెన్యూ అసిస్టెంట్‌గా ఉద్యోగం సంపాదించింది. ఇది కేవలం ఒక ఉద్యోగం సాధించిన అమ్మాయి కథ కాదు. ఇది ఆత్మవిశ్వాసం, పట్టుదల, అవిశ్రాంత కృషికి సంబంధించిన సజీవ సాక్ష్యం. ఆ అమ్మాయి పేరే మాలా పాపల్కర్. ఆ పాప పుట్టుకతోనే అంధురాలు కావడంతో కన్న తల్లిదండ్రులే ఆ చిన్నారిని వద్దనుకుని చెత్తకుప్పలో పడేశారు. స్థానికుల సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు ఆ చిన్నారి తల్లిదండ్రుల కోసం ఎంతగానో ప్రయత్నించారు. కానీ, వారికి ఆచూకీ దొరకలేదు. దీంతో,  పోలీసులు ఆ చిన్నారిని జల్గావ్​లోని రిమాండ్ హోమ్​‌లో చేర్పించారు. అంధత్వం ఆమెకు ఒక సవాలుగా ఉన్నప్పటికీ.. ఆమె దానిని తన బలహీనతగా చూడ...
Image
 భారత్, పాక్ మధ్య యుద్ధం జరిగితే? ఏఏ దేశాలు ఎవరికి సపోర్ట్ చేస్తాయి? యుద్ధం వల్ల ఎవరికి నష్టం? జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం సమీపంలోని బైసరన్ వ్యాలీలో ఉగ్రదాడి తర్వాత భారత్ వెంటనే కఠిన చర్యలకు దిగింది. 1960 నుంచి అమలులో ఉన్న సింధూ జల ఒప్పందాన్ని నిలిపివేసింది, దీనివల్ల పాకిస్థాన్‌లో నీటి సరఫరా, వ్యవసాయం తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. అటారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్ట్ మూసివేయబడింది, దీనితో రెండు దేశాల మధ్య వాణిజ్యం, ప్రయాణాలు స్తంభించాయి. పాకిస్థాన్ పౌరులకు జారీ చేసిన వీసాలు రద్దు చేయబడ్డాయి. అలాగే 48 గంటల్లో భారత్‌ను విడిచి వెళ్లాలని ఆదేశించింది. పాకిస్థాన్ హైకమిషన్‌లో సిబ్బందిని 55 నుంచి 30కి తగ్గించారు. సైనిక సలహాదారులను ఉపసంహరించారు. ఈ చర్యలు పాకిస్థాన్‌పై ఆర్థిక, దౌత్య ఒత్తిడిని పెంచాయి. మరోవైపు పాకిస్థాన్ ఈ చర్యలకు ప్రతిస్పందనగా తీవ్ర వైఖరి అవలంబించింది. భారత విమానాలకు తమ గగనతలంలో ప్రవేశాన్ని నిషేధించింది, దీనివల్ల భారత విమానయాన రంగంపై ప్రభావం పడనుంది. భారత్‌తో వాణిజ్య సంబంధాలను పూర్తిగా నిలిపివేసింది. భారత పౌరులకు జారీ చేసిన వీసాలను రద్దు చేసింది. 1972 సిమ్లా ఒప్పందంతో సహా ద్వైప...
Image
 సింధూ జలాలను భారత్ ఆపగలదు.. అందులో నో డౌట్ ప‌హ‌ల్గాం ఉగ్రదాడి నేప‌థ్యంలో భార‌త్ సింధు జ‌లాల ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.అయితే, ఈ విషయంపై పాకిస్తాన్ మంత్రి అయిస్ లెఘారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సింధూ నదీ జలాల్లో ప్రతి నీటి చుక్కా పాకిస్థాన్‌దేనంటూ వ్యాఖ్యానించారు. ‘సింధూ నదీ జలాల ఒప్పందం అమలును నిలిపివేస్తూ భారత్‌ తీసుకున్న నిర్ణయం పిరికిపంద, చట్టవిరుద్ధమైన చర్య అని. ఈ హక్కును మేం చట్టపరంగా, రాజకీయంగా, అంతర్జాతీయంగా పూర్తిశక్తితో కాపాడుకుంటాం. ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు మధ్యవర్తిగా ఉన్న ఈ ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలిగే అవకాశం లేదని. . ఈ చర్యతో నీటి యుద్ధానికి తెరతీస్తున్నారు’ అని పాకిస్థాన్‌ మంత్రి అవాయిస్‌ లెఘారీ స్పష్టం చేశారు. అయితే, ఈ ఒప్పందం ప్రకారం సింధు నదీ జలాల్లో భారత్‌ 20 శాతం, పాకిస్థాన్‌ 80 శాతం వినియోగించుకోవాలి. ఆనాటి ఒప్పందం ప్రకారం సింధు, జీలం, చినాబ్ జలాలు ఎలాంటి అవాంతరం లేకుండా పాక్‌లో ప్రవహించడానికి భారత్‌ వీలు కల్పించాల్సి ఉంది. కానీ,  పశ్చిమ నదుల నీటి వినియోగంపై పూర్తి నిషేధం లేదు. అయితే మౌలిక పరిస్థితుల్లో వ...
Image
 నిద్రలో మాట్లాడే వాళ్ల మాటలు నిజమవుతాయా? సైన్స్ ఏం చెబుతుంది? కొందరికి నిద్రలో మాట్లాడే అలవాటు ఉంటుంది. నిద్రలో మాటలను వారు మేలుకున్న తర్వాత ప్రస్తావిస్తే,  నేనలా మాట్లాడనేలేదంటూ కొట్టి పారేస్తారు. నిజానికి అలా నిద్రలో మాట్లాడటాన్ని సొమ్నిలోక్వీ (somniloquy) అని పిలుస్తారు. చిన్న పిల్లలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది, అయితే పెద్దవాళ్లలో కూడా సుమారు 5% మంది నిద్రలో మాట్లాడతారు. నిద్రలో మాట్లాడేవారు కొందరు స్పష్టంగా సంభాషిస్తారు, మరికొందరు అస్పష్టంగా గొనుగుతారు. కానీ ఈ మాటలు నిజమవుతాయా? లేదా అవి భవిష్యత్తును సూచిస్తాయా? ఈ ప్రశ్నకు సమాధానం సైన్స్ ఏం చెబుతుంది? నమ్మకాలు ఏం చెబుతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం.  సైన్స్ ప్రకారం చూస్తే.. నిద్రలో మాట్లాడటం సాధారణంగా మొదడులోని నాన్-REM లేదా REM దశలలో జరుగుతుంది. మొదడులోని REM దశలో.. మనం కలలు కంటాము. కొన్నిసార్లు ఈ కలల సందర్భంలో మాట్లాడతాము. ఈ మాటలు తరచూ రోజువారీ జీవితంలోని అనుభవాలు, ఆలోచనలు, లేదా ఒత్తిడితో ముడిపడి ఉంటాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తి రోజంతా ఒక సమస్య గురించి ఆలోచిస్తే, నిద్రలో ఆ సమస్య గురించి మాట్లాడవచ్చు. అయితే, ఈ మాటలు భవి...
Image
 అమెరికా రహస్యంగా చేస్తున్న ప్రయోగాల గురించి మీకు తెలుసా? ఇప్పటికీ కొనసాగున్నాయి!  అమెరికా.. ప్రపంచ అగ్రరాజ్యంగా ఉన్న దేశం. ప్రపంచ దేశాలకు నీతులు చెబుతూ.. తాను మాత్రం ప్రపంచానికి తెలియకుండా.. రహస్య ప్రయోగాలు చేస్తోంది. వాటిల్లో ప్రాజెక్ట్ MK Ultra, Area 51, PRISM ఈ పేర్లు వినగానే ఒక మిస్టరీ సినిమా సీన్ మన కళ్లముందు కనబడుతంది. కానీ, ఇవి కేవలం సినిమా కథలు కాదు.. అమెరికా చరిత్రలో నిజంగా జరిగిన, ఇప్పటికీ వివాదాస్పదంగా మిగిలిన సంఘటనలు. అసలు ఈ రహస్య ప్రయోగాలు ఎందుకు మొదలయ్యాయి? ఎందుకు దాచిపెట్టారు? ఇప్పుడు అవి ఏ స్టేజ్‌లో ఉన్నాయి? అనే విషయాలతోపాటు అమెరికా రహస్య ప్రయోగాల చీకటి అధ్యాయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అమెరికా రహస్య ప్రయోగాలు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదలైంది. 1947-1991 మధ్య జరిగిన కోల్డ్ వార్‌లో అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య పోటీ తీవ్రంగా ఉండేది. సైన్స్, టెక్నాలజీ, గూఢచర్యం, ఆయుధాలలో ఒకరినొకరు మించిపోవాలనే పోటీతత్వం నడిచేది. ఈ సమయంలో, అమెరికా తన శత్రువులను అధిగమించడానికి, లేదా వారి రహస్యాలను తెలుసుకోవడానికి, అనేక రహస్య ప్రయోగాలను చేపట్టింది. ఈ ప్రయోగాలు కొన్ని సైన్స్ ఆధా...
Image
 సముద్రంలో కనిపించిన వింత జీవి.. ఇది కేజీ రూ.28 వేలు సముద్రం అంటేనే ఒక మాయా లోకం. చూడటానికి ఎంతో అందంగా కనిపించే సముద్రంలో ఎన్నో అందమైన జీవులు కనిపిస్తాయి. అయితే అందమైన జీవులతోపాటుగా కొన్ని భయంకరమైన జీవులు కూడా కనిపిస్తాయి. అలాంటి ఒక వింత జీవి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం, ఇది యూరప్‌లోని వేల్స్‌లోని బెన్నార్ బీచ్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచిన ఒక సముద్ర జీవి. వేల్స్‌లోని డైఫ్రిన్ ఆర్డుడ్వీ దగ్గర ఉన్న బెన్నార్ బీచ్‌లో ఒక రోజు షెల్ లాంగ్‌మోర్ అనే మహిళ సముద్ర తీరంలో నడుస్తోంది. ఒడ్డున కొట్టుకొచ్చిన ఒక విచిత్రమైన జీవిని చూసి ఆమె ఒక్కసారిగా ఆగిపోయింది. అది ఏమిటో ఆమెకు అర్థం కాలేదు. దాని ఆకారం, రూపం చూస్తే సముద్రంలోని ఏదో రాక్షస జీవిలా కనిపించింది. పొడవైన, బాతు మెడలాంటి ఆకారంతో, రాళ్లకు అతుక్కుని ఉన్న ఆ జీవులు ఆమెను భయపెట్టాయి. కానీ, ఈ జీవి గురించి తెలిస్తే, అది భయపెట్టే జీవి కాదని, పైగా అదొక అద్భుతమైన, ఖరీదైన సముద్ర సంపద అని తెలుస్తుంది. సముద్ర నిపుణులు ఈ జీవిని పరిశీలించి, ఇవి Gooseneck Barnacles అని గుర్తించారు. వీటిని బాతు బర్నాకిల్స్ లేదా గూస్ బర్నాకిల్స్ అని కూడా పిలుస్తారు. ఎ...